
రాబోయే రోజుల్లో మళ్లీ సొంతంగానే అధికారంలోకి వస్తామని తెలంగాన మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. బెల్లం ఉన్న దగ్గరికే ఈగలు వస్తాయని.. తెలంగాణను దోచుకోవడానికి కొందరు సిద్ధంగా ఉన్నారని ఆయన హాట్ కామెంట్ చేశారు. పదేళ్లుగా తెలంగాణలో ఎలాంటి ఇబ్బందులు లేవని.. కానీ ఇప్పుడు తెలంగాణ సమస్యల వలయంలో చిక్కుకుందని కేసీఆర్ అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీ కూడా కాంగ్రెస్ పార్టీ అమలు చేయలేదని విమర్శించారు. తెలంగాణ కోసం ఎప్పటికైనా పోరాడేది బీఆర్ఎస్ మాత్రమే అని కేసీఆర్ స్పష్టం చేశారు. అటు ఏపీ రాజకీయాలపై కూడా కేసీఆర్ కామెంట్ చేశారు. ఏపీలో పొత్తు లేకుంటే చంద్రబాబు గెలిచేవారు కాదన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..