
వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో తెలుగు అభిమానులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్. ఈ మూవీతో ఈ బ్యూటీ మంచి ఫేమ్ సంపాదించుకుంది. దీంతో వరసగా స్టార్ హీరోల సరసన ఛాన్స్ కొట్టేసి అనతికాలంలోనే టాప్ వన్ హీరోయిన్గా మంచి పేరు తెచ్చుకుంది.
తర్వాత వరసగా సినిమాలు చేస్తూ టాలీవుడ్నే షేక్ చేసింది ఈ ముద్దుగుమ్మ. ఇక తెలుగులో అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్ చెక్కేసి అక్కడ తన నటనతో మరింత క్రేజ్ తెచ్చుకుంది.
అలాగే బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానినీ ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇక పెళ్లి తర్వాత కూడా ఈ ముద్దుగుమ్మ ఎక్కడా తగ్గలేదు. అదే అందం, అంతే జోష్తో వెబ్ సిరీస్లు సినిమాలు చేస్తుంది.
అంతే కాకుండా ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన క్యూట్ పిక్స్ షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. తాజాగా రకుల్ పింక్ డ్రెస్లో బెడ్ పై ఉన్న ఫొటోస్ షేర్ చేసింది.
ఇందులో ఈ చిన్నది చాలా ఆనందంగా నవ్వుతూ, ఫొటోలకు ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. మరీ మీరు కూడా ఆఫొటోస్ చూసేయండి.