తాజాగా ఆ నలుగురిని మిలిటరీ యూనిఫామ్లో తీసుకొచ్చి, రెడ్క్రాస్కు అప్పగించగా.. వారిని ఇజ్రాయెల్కు తీసుకెళ్తున్న వాహనం గాజాను వీడిందని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. కాల్పుల విరమణ ప్రారంభమైన తొలి రోజు ముగ్గురు మహిళా బందీలను హమాస్.. అలాగే వందకు పైగా పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడిచిపెట్టాయి. 42 రోజుల తొలి దశ కాల్పుల విరమణ ఒప్పందంలో తమ చెరలో ఉన్న 94 మంది బందీల్లో 33 మందికి హమాస్ స్వేచ్ఛ కల్పించనుంది. ప్రతిగా దాదాపు 1700 మందికి పైగా పాలస్తీనీయులకు తమ జైళ్ల నుంచి ఇజ్రాయెల్ విముక్తి కల్పించనుంది.
