
నకిలీ డాక్టర్ బండారం బయటపడంతో ఆపరేషన్కు సిద్ధం ఉన్న పలువురు రోగులు భయంతో వేరే ఆస్పత్రికి వెళ్లిపోయారు. నిందితుడు నరేంద్ర యాదవ్పై హైదరాబాద్లో కేసు నమోదైంది. ఛత్తీస్గఢ్ రాష్ట్ర అసెంబ్లీ మొదటి స్పీకర్గా పనిచేసిన రాజేంద్ర ప్రసాద్ శుక్లా మృతికి ఈ డాక్టర్ వైద్యమే కారణమని తాజాగా వార్తలు వస్తున్నాయి. ఛత్తీస్గఢ్ లో బిలాస్పుర్లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో శుక్లా గుండె సంబంధిత శస్త్రచికిత్స చేయించుకున్నారు. చికిత్స జరుగుతోన్న సమయంలోనే ఆయన మరణించారు. అప్పుడు డాక్టర్ నరేంద్ర జాన్ కెమ్ అనే యూకే వైద్యుడు వైద్యం చేశారు. ఈ ఘటనపై తాజాగా శుక్లా కుమారుడు మాట్లాడారు. నాన్నకు చికిత్స జరుగుతున్నప్పుడు తను అక్కడే ఉన్నట్లు చెప్పారు. ఆ వైద్యం జరుగుతున్న తీరుపై తనకు అప్పుడే అనుమానం వచ్చిందనీ అతడు నకిలీ వైద్యుడని తర్వాత తెలిసింది కానీ ప్రైవేటు ఆసుపత్రి మాత్రం అతడు గొప్ప డాక్టరని చెప్పిందనీ ఈ ఘటనపై ప్రభుత్వం సుమోటోగా విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. బిలాస్పుర్ సీఎంహెచ్ఓ డాక్టర్ ప్రమోద్ తివారీ మీడియాతో మాట్లాడుతూ.. ఈ విషయంపై దర్యాప్తు బృందాన్ని పంపినట్లు చెప్పారు. అతడు సరైన రిజిస్ట్రేషన్ లేకుండా ప్రాక్టీస్ చేసుంటే.. అది చాలా తీవ్రమైన విషయమని తెలిపారు.
మరిన్ని వీడియోల కోసం
సూర్యుడికి సోదరుడు ఉన్నాడా..?వీడియో
ప్లేటు నిండా రొయ్యల కర్రీ..తినాలంటే వర్రీ వీడియో