
ఇంతకీ పుత్తడి ధర ఎందుకు తగ్గుతోంది? నిజంగా తులం రేటు అంత తగ్గనుందా..?బంగారం బంగారమైపోయింది. ఇదీ.. నిన్నమొన్నటి వరకు వినిపించిన వార్త. కానీ ఇప్పుడు పరిస్థితి తారుమారైంది. పెరగడమే తప్ప తరగడం తెలియదన్నట్లు పెరుగుతూపోయిన పసిడి ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. రెండు మూడు రోజుల్లోనే తులం బంగారం రేటు 3వేలకుపైగా పతనమైంది. రానున్న రోజుల్లో ఈ రేటు మరింత తగ్గుతుందన్న వార్తలు సామాన్యుడికి ఊరటనిస్తున్నాయి. ముఖ్యంగా ఈ అంచనాలు భారతీయులకు సంతోషాన్నిస్తున్నాయి. ఇంతకాలం పెరుగుతున్న పసిడి ధరలతో బెంబేలెత్తిన జనం.. భవిష్యత్తులో అసలు బంగారం కొనగలమా అనే సందిగ్దంలో పడ్డారు. అయితే రానున్న రోజుల్లో పుత్తడి రేటు 40శాతం వరకు తగ్గొచ్చన్న అంచనాలు వారిలో కొత్త ఆశలు రేపుతున్నాయి. 2025 జనవరి నుంచి ఇప్పటి వరకు బంగారం ధర 17సార్లు ఆల్ టైం రికార్డులు క్రియేట్ చేసింది. మరికొన్ని రోజుల్లో తులం ధర అక్షరాలా లక్షకు చేరుతుందన్న అంచనాలు వెలువడ్డాయి. దీంతో చాలా మంది గోల్డ్లో ఇన్వెస్ట్ చేశారు. నిజానికి బంగారానికి మించిన సురక్షితమైన పెట్టుబడి సాధనం మరొకటి లేదు. అందుకే భారతీయులందరి ఇళ్లలో కచ్చితంగా ఎంతో కొంత బంగారం ఉంది. 2025లో ఇప్పటివరకు అత్యధిక రిటర్నులు ఇచ్చిన ఇన్వెస్ట్మెంట్ ఏదైనా ఉందంటే అది బంగారమే. దేశీయ మార్కెట్లో ఈ ఏడాది తొలి మూడు నెలల్లోనే 15.72 శాతం వృద్ధి నమోదు చేసిన గోల్డ్.. ఇన్వెస్టర్ల సంపదను పెంచింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ హవా కొనసాగించి సరికొత్త రికార్డులు సృష్టించింది.
మరిన్ని వీడియోల కోసం
గిన్నిస్ రికార్డులకెక్కిన ఎలుక..ఎందుకో తెలిస్తే షాకవుతారు వీడియో
శ్రీశైలంలో 2 చిరుతల సంచారం.. ఆ గేటు కాని లేకపోతే వీడియో
అయ్యో.. ఈ కండక్టర్ కష్టాలు ఎవరికీ రాకూడదు..వీడియో
క్రికెట్ ఆడుతూ కుప్పకూలిపోయిన విద్యార్థి.. ఏం జరిగిందంటే వీడియో