

అయితే వస్తూ వస్తూ ఆ భక్తుల టీమ్.. కోడి గుడ్లు, పలావ్తో అక్కడికి చేరుకుంది. రాంభగిచా బస్టాండ్ ఆవరణలో కోడిగుడ్డు, పలావ్ ఆరగించడాన్ని గుర్తించారు కొందరు శ్రీవారి భక్తులు. ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో హుటాహుటిన అక్కడకు చేరుకున్న విజిలెన్స్ సిబ్బంది.. భక్తుల దగ్గర ఉన్న ఆహారాన్ని సీజ్ చేశారు. తిరుమలలో మాంసాహారం తినడం నిషిద్ధమంటూ భక్త బృందాన్ని పోలీసులు మందలించారు. అయితే తిరుమలలో మాంసాహారం తినకూడదన్న విషయం తెలియక తెచ్చుకున్నట్లు భక్తులు తెలిపారు. దీంతో తమిళ భక్తులకు దీనిపై అవగాహన కల్పించి వదిలేశారు పోలీసులు. తమిళనాడుకు చెందిన ఈ భక్తులు తిరుమల కొండపైకే నిషేధిత ఆహారాన్ని తీసుకురావడం మాత్రం తీవ్ర కలకలం రేపింది.