

తన భూమిని అమ్ముతానంటూ ఓ మహిళ వద్ద నుంచి రూ.6 లక్షలు తీసుకున్నాడో వ్యక్తి. ఇక భూమికి సంబంధించిన డాక్యూమెంట్స్ ఇస్తానని ఆమెను ఇంటికి రమ్మన్నాడు. ఆమెను మాటల్లో పెట్టి, మెల్లిగా మద్యం తాగించాడు. ఇక ఆ తర్వాత ఆమెను అతి కిరాతకంగా హత్య చేశాడు. ఈ దారుణ ఘటన లక్నోలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో ఒక వ్యక్తి ఒక మహిళకు మద్యం తాగించి, గొంతు కోసి చంపి , ఆపై నిప్పంటించిన సంఘటన జరిగింది.
నిందితులు శివేంద్ర యాదవ్ (26), అతని స్నేహితుడు గౌరవ్ (19) మొదట బాధితురాలికి ఆస్తి పత్రాలు అందించడానికి ఫోన్ చేశారు. ఆమె వచ్చిన తర్వాత, వారు ఆమెకు మద్యం తాగించారు. మత్తులో ఆమె గొంతుకోసి.. ఆ తర్వాత మృతదేహానికి నిప్పు అంటించారు. సగం కాలిన ఆమె మృతదేహాన్ని నదిలో పడేశారని పోలీసులు తెలిపారు. ఐదు రోజులుగా కనిపించకుండా పోయిన అంజలి మృతదేహం శనివారం నది సమీపంలో ముక్కలైపోయిన స్థితిలో లభ్యమైంది.
నిందితుడు తన తండ్రికి, భార్యకు వీడియో కాల్ చేసి బాధితురాలి మృతదేహాన్ని చూపించాడని పోలీసులు చెబుతున్నారు. మృతురాలి కుటుంబ సభ్యులు ఆమె కాలిపోయిన స్కూటర్ను కాలువ దగ్గర కనుగొని, ఆమె వ్యాపార భాగస్వామిపై హత్య అభియోగం మోపడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. భూమి అమ్ముతానని నిందితుడు అంజలి నుంచి రూ.6 లక్షలు తీసుకున్నాడని ఆమె సోదరి కిరణ్ చెబుతోంది. తరువాత, పత్రాలు ఇచ్చే నెపంతో, అతను ఆమెకు ఫోన్ చేసి, ఇంటికి పిలిపించి ఇలా చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసుల విచారణలో యాదవ్, అతని భార్య నేరం అంగీకరించారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.