వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ -వేవ్స్ ముంబై వేదికగా అట్టహాసంగా ప్రారంభమైంది. భారతీయ సినిమాను ఉన్నత శిఖరాలకు చేర్చడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం నాలుగు రోజుల పాటు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సదస్సును ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గురువారం (మే01) ప్రారంభించారు. 90కి పైగా దేశాల నుంచి పదివేల మందికి పైగా ప్రతినిధులు, 300కి పైగా కంపెనీలు, 350కి పైగా స్టార్ట్ అప్లు ఈ భారీ సదస్సులో పాలు పంచుకుంటున్నాయి. అలాగే బాలీవుడ్, టాలీవుడ్ సహా.. భారత సినీ ఇండస్ట్రీకి చెందిన అగ్రనటులు, పలువురు వ్యాపార దిగ్గజాలు, కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల సీఎంలు ఈ కార్యక్రమంలో భాగం కానున్నారు. కాగా, ఈ కార్యక్రమంలో టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను ఇంటర్వ్యూ చేస్తున్నారు టీవీ9 ఎండీ, సీఈఓ బరుణ్ దాస్. ఆ ఇంటర్వ్యూకు సంబంధించిన లైవ్ లింక్ ఇక్కడ చూడండి.
