
టాలీవుడ్ లో ఎంతోమంది యంగ్ హీరోయిన్స్ దూసుకుపోతున్నారు. వరుసగా ఆఫర్స్ అందుకుంటూ రాణిస్తున్నారు. రితిక నాయక్.. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో జోరు మీద దూసుకుపోతున్న హీరోయిన్. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే నటిగా మంచి మార్కులు కొట్టేసింది. కానీ ఈ సినిమా తర్వాత అమ్మడుకు అంతగా ఆఫర్స్ రాలేదు. నాని నటించిన హాయ్ నాన్న మూవీలో చిన్న పాత్రలో మెరిసింది. ఇక ఇప్పుడు ఈ బ్యూటీ క్రేజీ ఆఫర్స్ అందుకుంటున్నారు.
మిరాయ్ చిత్రంలో మంచు మనోజ్ ప్రతినాయకుడిగా కనిపిస్తున్నాడు. అలాగే మెగా హీరో వరుణ్ తేజ్, మేర్లపాక గాంధీ కాంబోలో రాబోతున్న కొరియన్ డ్యాక్ డ్రాప్ హారర్ కామెడీ మూవీలోనూ ఈ అమ్మడు ఛాన్స్ దక్కించుకున్నట్లు సమాచారం. రితికా నాయక్ ఢిల్లీలో జన్మించింది. రితికా తొలిసారిగా 2022లో విడుదలైన “అశోక వనంలో అర్జున కళ్యాణం” అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మిరాయి సినిమాలో తేజ సెజ్జ హీరోగా నటిస్తున్నాడు. అలాగే వరుణ్ తేజ్ నటిస్తున్న కొరియన్ కనకరాజు”(పరిశీలనలో ఉన్న టైటిల్), సినిమాలతో పాటు మరో సినిమాను కూడా లైనప్ చేసింది.
గోపీచంద్ హీరోగా సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్నసినిమాలోనూ హీరోయిన్ గా నటిస్తుంది రితిక నాయక్. ఇలా వరుస ప్రాజెక్ట్స్ తో ఈ చిన్నది దూసుకుపోతుంది.రితికా నాయక్ తన అందం, నటనా నైపుణ్యంతో తెలుగు సినీ అభిమానులను ఆకట్టుకుంటూ ఆకట్టుకుంటుంది. అలాగే సోషల్ మీడియాలోనూ క్రేజీ ఫొటోలతో అభిమానులను ఆకట్టుకుంటుంది. ఈ అమ్మడి ఫోటోలకు నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.