
చల్లని నీరు తాగితే శరీరానికి మేలు జరుగుతుందనుకునే వారు చాలా మంది ఉంటారు. వేసవి కాలంలో శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచుకోవడం చాలా అవసరం. కానీ ఒకేసారి ఎక్కువ నీరు తాగితే ఒంటికి ప్రమాదం కలిగించే పరిస్థితి ఏర్పడవచ్చు. ముఖ్యంగా ఎండలో ఉన్నాక వెంటనే లీటరు పైగా నీరు తాగడం అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది.
వేసవిలో నీరు తాగే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. క్రమం తప్పకుండా తగినన్ని నీళ్లు తాగాలి కానీ.. ఒకేసారి అధికంగా తాగడం వల్ల శరీరంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. శరీరానికి అవసరమైన నీటి మోతాదును తెలుసుకుని కొద్దికొద్దిగా తాగటం మంచిది.
ఎవరికి ఎంత నీరు అవసరం..?
- ఇంట్లో ఉండే మహిళలు, పెద్దవారు: రోజుకు 3-4 లీటర్ల వరకు తాగడం మంచిది.
- విద్యార్థులు, ఉద్యోగస్తులు: ఎయిర్ కండిషన్ గదుల్లో పనిచేసేవారు 2.5-3 లీటర్లు తాగాలి.
- బయట ఎక్కువ సమయం గడిపే వారు: కూలీలు, రైతులు 4-5 లీటర్ల వరకు తాగాలి.
- ఆరోగ్య సమస్యలు ఉన్నవారు: గుండె, కిడ్నీ, షుగర్ ఉన్నవారు డాక్టర్ సలహా తీసుకోవాలి.
ఎండలో ఉండే సమయంలో ఏం చేయాలి..?
- ఎండకు వెళ్లే ముందు కొద్దిగా నీరు తాగడం మంచిది.
- పని చేసే సమయంలో ఎలక్ట్రోలైట్ వాటర్, కొబ్బరి నీరు తాగడం ఆరోగ్యానికి మేలు.
- టైమ్కు నీరు తాగేందుకు అలారం పెట్టుకోవడం వల్ల మర్చిపోకుండా ఉంటారు.
నీరు తాగే సరైన పద్ధతి ఏంటి..?
- ఒక్కసారిగా అధికంగా నీరు తాగకూడదు.
- గ్లాస్ ద్వారా తాగడం ఉత్తమం.
- గోరువెచ్చని లేదా గది ఉష్ణోగ్రత కలిగిన నీరు తాగాలి.
- సోడా, తీపి కూల్డ్రింక్స్ పక్కన పెట్టాలి.
ఒకేసారి లీటరు పైగా నీరు తాగితే హైపోనాట్రీమియా అనే సమస్య వచ్చే ప్రమాదం ఉంది. దీనివల్ల రక్తంలో సోడియం స్థాయులు తగ్గిపోతాయి. దీని వల్ల తలనొప్పి, బలహీనత, ఒళ్లు అదిరిపోవడం, కొన్నిసార్లు కోమాలోకి వెళ్లే పరిస్థితి కూడా ఏర్పడొచ్చు. వేసవిలో నీరు తాగే విధానం సరైన రీతిలో ఉంటే అనారోగ్య సమస్యలు రాకుండా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. నీటి మోతాదును అంచనా వేసుకుని, శరీరానికి అవసరమైనంత మాత్రమే తాగడం ఉత్తమం.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)