సరిహద్దులు మూసివేయడంతో నిశ్చితార్థం దాకా వచ్చిన పెళ్లి నిలిచిపోయిందని అతను వాపోయాడు.రాజస్థాన్కు చెందిన సైతాన్సింగ్కు, అట్టారీ సరిహద్దు దాటి పాకిస్థాన్లో ఉన్న యువతితో వివాహం నిశ్చయమైంది. పెళ్లికి ఇరు కుటుంబాలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. వరుడి బంధువుల్లో చాలామంది ఇప్పటికే పాకిస్థాన్కు చేరుకున్నారు. ఇంతలోనే ఉగ్రవాదులు పహల్గాంలో మారణహోమం సృష్టించారు. 26 మంది అమాయకుల ప్రాణాలు తీసారు. దీంతో పాకిస్తాన్పై భారత్ ఆంక్షలు విధించింది. సరిహద్దులను మూసివేయడంతో వధువు ఇంటికి వెళ్లే అవకాశాలు మూసుకుపోయాయి. దీంతో సైతాన్సింగ్ ఏం చేయాలో అర్థం కావడం లేదంటూ ఓ ఇంటర్వ్యూలో బాధపడ్డాడు. సైతాన్ సింగ్ కు వచ్చిన కష్టంపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం :
