

ఇంతలో ఒక్కసారిగా పెద్ద శబ్ధం వినిపించింది. ఏం జరిగిందో తెలుసుకునే లోపే ఐదుగురు చిన్నారులకు గాయాలు కావడంతో వారి ఆర్తనాదాలతో స్కూలు ప్రాంగణం మార్మోగింది. దాంతో చుట్టుపక్కలవారు అక్కడికి పరుగెత్తుకొచ్చారు. అంగన్వాడి స్కూలు పై కప్పు పెచ్చులూడి చిన్నారులపై పడటంతో భయంతో చిన్నారులు ఏడవడం మొదలుపెట్టారు. అలర్టయిన అంగన్వాడి సిబ్బంది, స్థానికులు చిన్నారులను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో మౌనిక, హారిక, రిషిక, అంకిత, అవినాష్ అనే విద్యార్థులు గాయపడ్డారు.