
క్యాన్సర్ మహమ్మారి ఎంతో మంది ప్రాణాలు తీసింది. చికిత్స ఉన్నప్పటికీ.. ఇప్పటికీ క్యాన్సర్ పేరు వింటే చాలు భయం ఆటోమేటిక్గా పుట్టేస్తుంది. అయితే.. తాజాగా ఒక కొత్త అధ్యాయం కూడా క్యాన్సర్కు సంబంధించి సరికొత్త విషయాన్ని వెల్లడించింది. మనం అస్సలు ఊహించని కొన్ని కారణాలతో కూడా క్యాన్సర్ రిస్క్ పెరుగుతుందని పేర్కొంది. ఇంతకీ ఆ రిపోర్ట్ ఏంటి? వేటి వల్ల క్యాన్సర్ రిస్క్ పెరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.. తుఫానులు, భూకంపాలు, వరదలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు లాంటి ప్రకృతి వైపరీత్యాలు కూడా క్యాన్సర్ ముప్పును పెంచుతున్నాయి. రెండు వారాల వ్యవధిలో ప్యూర్టో రికోను తాకిన ఇర్మా, మారియా తుఫానుల సమయంలో, అలాగే కోవిడ్-19 మహమ్మారి సమయంలో పెద్దప్రేగు క్యాన్సర్ నిర్ధారణల రేట్లు తగ్గాయని పరిశోధకులు క్యాన్సర్ జర్నల్ పేర్కొంది.
కానీ, చివరి దశలో ఉన్న పెద్దప్రేగు క్యాన్సర్ నిర్ధారణలు అంచనాలను మించి పెద్ద సంఖ్యలో పెరిగాయి. తుఫాను కారణంగా ప్రజలకు స్క్రీనింగ్ యాక్సెస్ను చేయడం సాధ్యం కాలేదు, దీని ఫలితంగా ప్రాణాంతక పరిస్థితిని ముందుగానే, చికిత్స చేయగల దశలో పట్టుకోలేకపోయాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. ప్రకృతి వైపరిత్యాల సమయంలో క్యాన్సర్ గుర్తింపును ఆలస్యం అయి ఉండొచ్చు, ఆరోగ్య ఫలితాలను మరింత దిగజార్చి ఉండవచ్చు అని ప్యూర్టో రికో విశ్వవిద్యాలయ సమగ్ర క్యాన్సర్ సెంటర్కు చెందిన సహ-ప్రధాన పరిశోధకుడు టోనాటియు సువారెజ్-రామోస్ తెలిపారు.
తమ పరిశోధన కోసం శాస్త్రవేత్తలు ప్యూర్టో రికో సెంట్రల్ క్యాన్సర్ రిజిస్ట్రీ డేటాను విశ్లేషించారు. 2012 నుండి 2021 వరకు నిర్ధారణ చేయబడిన, చికిత్స చేయబడిన అన్ని క్యాన్సర్ కేసుల సమాచారం అందులో ఉంది. ఆ కాలంలో కనీసం 18,000 మందికి మొదటిసారి పెద్దప్రేగు క్యాన్సర్ నిర్ధారణ జరిగింది, కాబట్టి, ట్రెండ్ల ఆధారంగా, సెప్టెంబర్ 2017లో – ఇర్మా, మరియా వచ్చిన నెల తర్వాత – అంచనా వేసిన పెద్దప్రేగు క్యాన్సర్ కేసుల సంఖ్య 161 ఉండేది. బదులుగా, ఆ నెలలో దాదాపు 80 కేసులు మాత్రమే నిర్ధారణ అయ్యాయి. అంటే సగం కంటే తక్కువ. కోవిడ్ లాక్డౌన్ పరిమితుల తర్వాత రెండవ తగ్గుదల సంభవించిందని పరిశోధకులు గుర్తించారు. ఏప్రిల్ 2020లో కేవలం 50 పెద్దప్రేగు క్యాన్సర్ కేసులు మాత్రమే నిర్ధారణ అయ్యాయి, ఇది ఊహించిన 162 కేసుల కంటే మూడు రెట్లు తక్కువ. “తుఫానులు, కోవిడ్-19 మహమ్మారి తర్వాత ట్రెండ్లలో ఈ మార్పులు ఆంకాలజీ సేవల లభ్యత, కొనసాగింపులో అంతరాయాల వల్ల సంభవించాయని మేం నమ్ముతున్నాం” అని పరిశోధకులు తెలిపారు.
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. తీవ్రమైన వాతావరణ మార్పుల కారణంగా, ప్రపంచవ్యాప్తంగా ప్రకృతి వైపరీత్యాలు సర్వసాధారణం అవుతున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు మరింత తీవ్రమైన తుఫానులు, వినాశకరమైన కార్చిచ్చులు, సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి. పెద్ద ఎత్తున జరిగే ఇటువంటి విపత్తులకు ప్రభుత్వాలు మెరుగైన ఆరోగ్య సంరక్షణ సేవలను ప్రోత్సహించి, ప్రణాళికలు వేయాలని, ప్రజలకు చాలా అవసరమైన క్యాన్సర్ స్క్రీనింగ్లను పొందడానికి మార్గాలను కనుగొనాలని నిపుణులు భావిస్తున్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.